క్రైమ్/లీగల్

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతండగా.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఫిబ్రవరి 16: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై ఒకరు మృతిచెందారు. మృతుడి బంధువులు, గ్రామస్థులు, బషిరాబాద్ మండల పోలీసుల సమాచారం మేరకు సంఘటన వివరాలిలా ఉన్నాయి. కర్నాటకలోని గుల్బర్గా జిల్లా సేడం తాలూకా తెల్కుర్ గ్రామానికి చెందిన న్యాటకారీ భీమప్ప (52) బషిరాబాద్ మండలం కంసాన్‌పల్లి(బీ)లో తన పెద్ద కూతురు రాములమ్మ ఇంట్లో కొంత కాలంగా జీవనం సాగిస్తున్నాడు.శనివారం ఇంట్లో తన సెల్‌ఫోన్‌ను చార్జింగ్ కరెంటు ప్లగ్‌లో పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. కంసాన్‌పల్లి(బీ)లో కొన్ని రోజులుగా కరెంటు సరఫరాలో లో హైవోల్టేజీల సమస్యలు ఉన్నాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ట్రాన్స్‌కో అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. మృతుడు భీమప్ప తన కుడిచేయిని గతంలో కోల్పోయి వికలాంగుడిగా ఉన్నట్లు అతని కూతురు రాములమ్మ తెలిపింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని బషిరాబాద్ ఎస్సై మహీపాల్ రెడ్డి తెలిపారు.