క్రైమ్/లీగల్
ఉద్యమకారులపై రైల్వే కేసులు ఎత్తివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 17 February 2019
హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన రైల్వే కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల్లో అప్పట్లో సీఎం కేసీఆర్, హరీష్రావు, కేటీఆర్, ఈ. రాజేంద్రర్, మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, జగదీష్రేడ్డి, తెలంగాణ జన సమతి అధ్యక్షుడు కోదండరామ్, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగర్రావు, స్వామిగౌడ్, దాసోజ్ శ్రావణ్, విఠల్, వివేక్లు ఉన్నారు. ఈ కేసులు వికారాబాద్, సికింద్రాబాద్, మంచిర్యాల స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ కేసులను ఉపసంహరిస్తూ న్యాయశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.