క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఫిబ్రవరి 17: వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలైన సంఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కనుపూరు సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు నెల్లూరు రూరల్ మండలం బుజబుజనెల్లూరు ప్రాంతానికి చెందిన షేక్ రియాజ్ (19), షేక్ ఫయాజ్ (17), షేక్ షాన్‌వాజ్ (16) వరుసకు సోదరులు అవుతారు.
తమ బంధువుల గ్రామమైన వెంకటాచలం మండలంలోని ఇస్లాంపేట వెళ్లేందుకు మోటార్‌బైక్‌పై బుజబుజనెల్లూరు నుంచి బయలుదేరారు. వారు కనుపూరు సమీపానికి చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ మోటార్‌బైక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అటుగా వెళ్లే వాహనచోదకులు వెంటనే 108 వాహన సిబ్బందినికి, వెంకటాచలం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే నెల్లూరు రూరల్ సీఐ శ్రీనివాసరావు, వెంకటాచలం ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి, శిక్షణ ఎస్‌ఐలు బాలుమహేంద్ర, కూచిపూడి స్వప్న అక్కడకు చేరుకుని సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.