క్రైమ్/లీగల్

మద్యం మత్తులో తల్లిని కడతేర్చిన కసాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 18: మద్యం మత్తులో కన్నతల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించి కడతేర్చిన ఓ తనయుడి దురాగతమిది. ఈ సంఘటన ఖమ్మం రూరల్ మండలంలోని చింతపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కుసుమ ధనమ్మ(56)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త చనిపోయాడు. కూతురు, ఇద్దరు కుమారులకు వివాహమైంది. పెద్దకొడుకు కుసుమ రాము కొత్తగూడెంలో జీవనం సాగిస్తున్నాడు. చిన్నకొడుకు కుసుమ హనుమంతరావు భార్య పిల్లలు చింతపల్లిలోనే తమ రెండు గదుల ఇంటిలో తల్లితో కలిసి జీవిస్తున్నారు. ఆదివారం రాత్రి మద్యం తాగిన హనుమంతరావు భార్యతో గొడవపడ్డాడు. తల్లి ధనమ్మ వద్దని వారించింది. దీంతో ఆగ్రహించిన హనుమంతరావు అడ్డువచ్చిన తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. స్థానికులు మంటలు ఆర్పివేసి ధనమ్మను చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించింది.