క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురం, ఫిబ్రవరి 19: విజయపురం మండలంలోని సూరికాపరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మునిశేఖర్ మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కెవిబిపురం మండలంలోని కొత్తకండ్రిగ గ్రామంలో జేసీబీ ఆపరేటర్‌ను తీసుకురావడానికి మంగళవారం ఉదయం మునిశేఖర్ వెళ్లాడని తెలిపారు. తిరుగు ప్రయాణంలో పిచ్చాటూరు ఆరణియార్ డ్యామ్ సమీపంలో జింక మోటార్‌సైకిల్‌పై దూకడంతో అదుపుతప్పిన మోటార్‌సైకిల్ విద్యుత్ స్తంభానికి ఢీకొంది. మునిశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా, పిచ్చాటూరు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.