క్రైమ్/లీగల్

ప్రాణం తీసిన సరదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: వేగం థ్రిల్.. బట్ కిల్.. ఆత్యంత వేగం ప్రమాదకరం అంటూ ఎన్ని ప్రకటనలు చేసిన ఫలితం దక్కకుండా పోతుంది. నగరంలో చట్టవ్యతిరేకమైనా బైక్ రెసింగ్‌కు బ్రెక్ వెయాల్సిన పోలీసుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలు బలిగొంది. సరదా ప్రాణం తీసింది. బైక్ రెస్‌లో ఇద్దరు మృతి చెందిన సంఘటన మంగళవారంనాడు రాంగోపాల్‌పేట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తోటి స్నేహితులతో కలిసి సరాదా కోసం నెక్లెస్ రోడ్డులో మంగళవారం సాయంత్రం వేళలో బైక్ రెస్ నిర్వహించారు. ఖైరతాబాద్ చింతల్‌బస్తీ ప్రాంతానికి చెందిన నిఖీల్ (17), ప్రశాంత్ (18) నారాయణగూడలోని చైతన్య జూనియర్ కాలేజీలో బైపీసీ చదువుతున్నారు. సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగు గంటలలోపు ఇద్దరు స్నేహితులు కలిసి సరదాగా బైక్‌రెస్ నిర్వహించారు. ఈ రెస్ వెగం అధికం కావడంతో ఇద్దరు రోడ్డు డివైడర్‌ను ఢీ కోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిఖీల్ అక్కడిక్కడే మరణించగా, ప్రశాంత్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసును రాంగోపాల్‌పేట్ పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.