క్రైమ్/లీగల్
కృష్ణ కాంత్ పార్క్ వద్ద ఆర్టీసీ బస్ ఢీ కొని ఒకరి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 February 2019
హైదరాబాద్ / ఖైరతాబాద్, ఫిబ్రవరి 19: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్గూడ వెంకటగిరి ప్రాంతానికి చెందిన ముక్తా హుస్సేన్ (20) ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై బోరబండ నుంచి వెంకటగిరికి వెళుతుండగా బోరబండ నుండి సికింద్రాబాద్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఆర్టీసీ బస్సులు నిర్లక్ష్యంగా నడపడం వల్లే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అమాయకులు చనిపోతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.