క్రైమ్/లీగల్

కన్నతల్లే కాటేసిందా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, ఫిబ్రవరి 19: నవమాసాలు మోసి కన్న ఆ తల్లే తన బిడ్డలను పొట్టన పెట్టుకుందన్న వదంతులు మంగళవారం పెడనలో విస్తారంగా వ్యాపించాయి. 45 రోజుల క్రితం భర్తను కోల్పోయిన ఆ మహిళే తన ఇద్దరు చిన్నారులను రెండు రోజుల వ్యవధిలో మట్టుపెట్టిందన్న ప్రచారం పట్టణ వాసులను కలవరపాటుకు గురి చేసింది. వివరాల్లోకి వెళితే స్థానిక బస్టాండ్ సమీపంలో సోమ, మంగళ వారాల్లో ఇద్దరు బాలికలు మృతి చెందారు. వీరి మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మోకా ప్రశాంతి (05), మోకా దివ్య (03) అనుమానాస్పదంగా మృతి చెందటంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గత సోమవారం చిన్న కుమార్తె దివ్య మృతి చెందింది. అయితే ఆ బాలిక మృతి పట్ల ఎలాంటి అనుమానాలు వ్యక్తం కాలేదు. వాంతులు, విరోచనాలు కావటంతో మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మంగళవారం పెద్ద కుమార్తె ప్రశాంతి కూడా అనారోగ్యంతో మృతి చెందటంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానం కూడా కన్న తల్లి మీదే వ్యక్తం చేయడం విశేషం. బందరు తాలుకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బిబి రవి కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని సందర్శించి బందరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అభిమన్యు తెలిపారు.