క్రైమ్/లీగల్

చెరుకు యంత్రం ఢీకొని ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్పల్లి, ఫిబ్రవరి 20: చెరుకు యంత్రం డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మర్పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన సింగంశెట్టి ప్రభాకర్ గుప్తాకు చెందిన వ్యవసాయ పొలం వద్ద కూలి పనికి సింగూరి మల్లయ్య వెళ్లాడు. చెరుకు కోత జరుగుతుండగా చెరుకు నింపుకోడానికి డ్రైవర్ యంత్రాన్ని నిర్లక్ష్యంగా వెనుకకు నడపగా అక్కడే వున్న మల్లయ్యను ఢీకొంది. అతని పైనుంచి వెళ్లడంతో మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు.