క్రైమ్/లీగల్

కోటయ్య మృతిపై పోలీసు దర్యాప్తు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యడ్లపాడు, ఫిబ్రవరి 21: యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో ఈనెల 18వ తేదీన మృతిచెందిన రైతు కోటయ్య కేసుకు సంబంధించి పోలీసుశాఖ ఉన్నత స్థాయి అధికారులతో దర్యాప్తు ప్రారంభించింది. గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ వరదరాజు గురువారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈయన నేతృత్వంలో నరసరావుపేట డీఎస్పీ, చిలకలూరిపేట, వినుకొండ రూరల్ సీఐలు, సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కోటయ్య మృతిపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు ప్రారంభించాలని విచారణ అధికారులను ఆదేశించారు. కాగా కొండవీటి కోట ఉత్సవాల సందర్భంగా 18వ తేదీన రైతు కోటయ్య మృతి వివాదాస్పదంగా మారడం, ఈ సందర్భంగా కోటయ్య బంధువులు ప్రాథమికంగా పోలీసులతో వాదోపవాదాలు చేయడం తెలిసిందే.