క్రైమ్/లీగల్

అగ్నిప్రమాదంలో మహిళ సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, ఫిబ్రవరి 21: ఆదమరచి నిద్రపోతున్న సమయంలో ప్రమాదవశాత్తు జరిగిన నిప్పంటుకుని పూరిల్లు దగ్ధమైన సంఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం చేబ్రోలు గ్రామంలోని అప్పాపురం ఛానల్ సమీపంలో జీబీసీ రోడ్డు పక్కన పూరిగుడిసెలు వేసుకుని ఎస్టీలు నివశిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి పూరిగుడిసెలో కొవ్వొత్తి వెలిగించి వనజ, భర్త శ్రీను నిద్రపోతుండగా జరిగిన అగ్నిప్రమాదంలో వనజ సజీవ దహనమైంది. భర్త శ్రీనివాసరావుకు కూడా పాక్షికంగా శరీరం కాలిపోయింది. ఇతన్ని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని చేబ్రోలు సిఐ డి నరేష్‌కుమార్ పరిశీలించి ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.