క్రైమ్/లీగల్

కారు బోల్తా - వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలమత్తూరు, ఫిబ్రవరి 21 : మండల పరిధిలోని కోడూరు సమీపంలో కారు బోల్తా పడిన ఘటనలో వెంకటేష్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గోరంట్ల మండలం చలమయ్యగారిపల్లికి చెందిన వెంకటేష్ కనిశెట్టిపల్లికి చెందిన మహిళను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం భార్యాభర్తలు దుస్తులు ఉతికేందుకు జాతీయ రహదారి పక్కన ఉన్న నీటి గుంత వద్దకు వచ్చారు. భార్య ఉతుకుతుండగా వెంకటేష్ జాతీయ రహదారి పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బెంగళూరు నుంచి బళ్లారికి వెళ్తున్న కారు అదుపు తప్పి పల్టీ కొట్టి వెంకటేష్‌పై పడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.