క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, ఫిబ్రవరి 21: మండలంలోని నిమ్మలకుంట గ్రామానికి చెందిన రమేష్ (35) విద్యుత్ షాక్‌తో గురువారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే నిమ్మలకుంట గ్రామంలో రమేష్ తన ఇంటిలో విద్యుత్ రాలేదని, విద్యుత్ స్తంభం పైకి ఎక్కి వాటిని అమర్చేందుకు ప్రయత్నించే సమయంలో విద్యుత్‌షాక్‌కు గురై కిందపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి బంధువుల సాయంతో రమేష్ భౌతికకాయాన్ని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆసుపత్రిలో రమేష్ భౌతికకాయాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. తక్షణసాయం కింద రూ.20వేలు ఎమ్మెల్యే ఆర్థికసాయాన్ని కుటుంబానికి అందించారు.