క్రైమ్/లీగల్

లారీ..ఆటో ఢీ ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మార్చి 15: ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ధారూరు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని ఎబ్బనూర్ గ్రామానికి చెందిన జగన్ ఆటో నడుపుతూ నగర శివారులోని రాంచంద్రపురంలో నివాసం ఉంటున్నాడు. స్వగ్రామంలో తెలిసినవారు ఒకరు చనిపోవడంతో అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఎబ్బనూరు బయల్దేరారు. ఎబ్బనూరు చెరువు సమీపంలోకి రాగానే తాండూరు నుంచి వికారాబాద్ వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలోకమలమ్మ(44), శారద(32), అర్చన(11) మృతిచెందగా, గోపాల్, సంతోష, అక్షయ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని వికారాబాద్ డీఎస్‌పీ శిరీష సందర్శించి ప్రమాద వివరాలను స్థానికులకు అడిగి తెలుసుకున్నారు.