క్రైమ్/లీగల్

రామ్మోహన్ హత్య కేసులో నిందితులకు రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, మార్చి 16: షాబాద్ మండల పరిధిలోని నరేడ్లగూడ గ్రామానికి చెందిన ముక్కు రామ్మోహన్ (37) హత్య కేసులో నిందితులను శనివారం రిమాండ్ చేసిన్నట్లు చేవెళ్ల ఏసీపీ వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 13న ముక్కు రామ్మోహన్‌ను అదే గ్రామానికి చెందిన అతని బావ భీంభరత్ అనుచరులు అంతమోందించాలని ప్లాన్ వేసుకున్నారు. గ్రామానికి చెందిన ముక్కు రవికుమార్, గుడూర్ మహేష్, ముక్కు అశోక్, ముక్కు రమేష్, తగరం నాగరాజ్ కలిసి షాబాద్ మండల పరిధిలోని బోనగిరిపల్లి గ్రామ శివారులో రామ్మోహన్‌ను వెంబడించి పట్టుకొని కత్తితో దారుణంగా పొడిచి, తలపై రాళ్లతో మోది చంపివేశారు. మృతదేహాన్ని కారులో తీసుకొని భీంభరత్ ఫాంహౌజ్‌లో పూడ్చిపెట్టినట్లు నిందితులు ఒప్పుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారని పట్టుకొని త్వరలోనే రిమాండ్‌కు తరలిస్తామని ఏసీపీ పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో సీఐ గురువయ్య గౌడ్, షాబాద్ ఎస్‌ఐ రవికుమార్ ఉన్నారు.