క్రైమ్/లీగల్

నందికొట్కూరులో కుటుంబం ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, మార్చి 20: కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. బేడ బుడగజంగం కాలనీలో ఉంటున్న వీరాంజనేయులు (28), అతని భార్య వసంత (26), పిల్లలు రామలక్ష్మి (7), రమేష్ (5) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం ఇంటినుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు కిటికీలోంచి చూడగా నలుగురు ఉరికి వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న బంధువులు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి వారిని కిందకు దింపగా అప్పటికే మృతిచెందారు. వీరి మధ్య ఎలాంటి ఆస్తి గొడవలు, అప్పులు లేవని బంధువులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఆత్మహత్య చేసుకున్న వీరాంజయనేయులు కుటుంబం (పాత చిత్రం)