క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 21: తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ యువకుడు తాను అర్ధంతరంగా తనువు చాలించిన సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌లో నివాసం ఉండే ముత్యాల నర్సింహ రాజు కుమారుడు చంద్రజిత్ (24) ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. వ్యయామంపై మక్కువ కలిగిన ఇతను వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు సైతం హాజరయ్యేవాడు. పోస్ట్ ఆఫీస్ గల్లీలో తండ్రికి చెందిన రబ్బర్ స్టాంప్‌లు తయారు చేసే దుకాణంలో ఉంటూ సహాయం చేస్తున్నాడు. కాగా తల్లి రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడి ఈ ఏడాది జనవరిలో మృతిచెందింది. తల్లి మరణించినప్పటి నుంచి మానసికంగా కృంగిపోయాడు. బుధవారం తల్లి నెలవారి చేపట్టే కర్మకాండలను నిర్వహించారు. ఉదయం నుంచి కుటుంబ సభ్యులతో గడిపిన చంద్రజిత్.. సాయంత్రం బయటకు వెళ్లి ఎనిమిది గంటల సమయంలో తిరిగి ఇంటి వచ్చాడు. నేరుగా అతను నిద్రించే గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు. గురువారం ఉదయం ఎంత ప్రయత్నించినా అతని గదిలో నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైన ఉన్న కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరి బిగించుకొని నిర్జీవంగా కనిపించాడు. తీవ్ర ఆవేదనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే సమాచారాన్ని స్థానిక సైఫాబాద్ పోలీసులు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలుపు తెరిచి ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.