క్రైమ్/లీగల్

మనస్థాపానికి గురై ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 24: భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపానికి గురైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ రైల్వేస్టేషన్ రోడ్డులో నివాసం ఉండే శ్రీనివాస్(36) శైలజ భార్యాభర్తలు. దంపతులు మూడు రోజులుగా ఎదో విషయమై గొడవపడుతున్నారు. అలిగిన భార్య శైలజ పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన శ్రీనివాస్ ఆదివారం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గణేశ్ తెలిపారు.