క్రైమ్/లీగల్
దివ్యాంగుడి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 March 2019
మేడ్చల్, మార్చి 25: కిరోసిన్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మండల డబిల్పూర్ గ్రామానికి చెందిన సంతోష్(31) భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో సంతోష్ భార్య అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. తీవ్ర మనస్థాపానికి గురైన సంతోష్ సోమవారం ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ గణేశ్ తెలిపారు.