క్రైమ్/లీగల్
వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, ఏప్రిల్ 12: ఈవీఎంలుకు అనుసంధానించిన వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఉండవల్లి ప్రజావేదికలో ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈవీఎంల వినియోగంపై పోరాడేందుకు శనివారం ఢిల్లీ వెళ్తున్నట్టు తెలిపారు. వీవీప్యాట్ల లెక్కింపునకు ఆరు రోజులా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లోని స్లిప్లను లెక్కించేందుకు ఆరు గంటలు మించి సమయం పట్టదని గుర్తు చేశారు. గతంలో పేపర్ బ్యాలెట్లను 24 గంటల్లో లెక్కించే వాళ్లన్నారు. ఈ విషయంలో తాను సవాల్ చేస్తున్నానని, నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఈవీఎంలపై దేశ స్థాయిలో పోరాడుతానన్నారు. ధర్నాలు, ఆందోళనను చేసేందుకు సిద్ధమన్నారు. ఈవీఎంల వినియోగంపై తనకు నమ్మకం లేదని తెలిపారు. ఈ విషయమై సీఈసిని కలసి ఫిర్యాదు చేయనున్నట్టు చంద్రబాబు చెప్పారు.