క్రైమ్/లీగల్

అదృశ్యమైన యువతి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఏప్రిల్ 14: సూరారం కాలనీలోని మురికికాలువలో ప్యాక్ చేసి ఉన్న లగేజీ బ్యాగ్‌లో మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రామచంద్రాపురం ఎల్‌ఐజీ కాలనీలో నివాసముండే శ్రీనివాస రావు కుమార్తె లావణ్య(25) టీసీఎస్ ఉద్యోగిని. సూరారం కాలనీ, సుందర్ నగర్‌లో నివాసముండే సునీల్ కుమార్(25) జూబ్లీహిల్స్‌లోని మోల్డ్‌టెక్‌లో పనిచేస్తాడు. కొంతకాలంగా లావణ్య, సునీల్ కుమార్‌లు స్నేహితులు. సునీల్ కుమార్‌ను వివాహం చేసుకోవాలని లావణ్య ఒత్తిడి చేసింది. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం సునీల్ కుమార్ ఇతర దేశానికి వెళ్లి వివాహం చేసుకుని అక్కడే ఉద్యోగం చేసుకుందామని లావణ్యను నమ్మించి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తీసుకువెళ్లాడు. తీసుకువెళ్లిన రోజు ఫ్లైట్ రద్దయ్యిందని చెప్పి శంషాబాద్‌లో ఓ హోటల్ రూమ్‌ను తీసుకున్నాడు. ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదు కానీ సూరారంలోని మురికికాలువలో లావణ్య మృతదేహం లగేజీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి పడేసి ఉంది. మూడు రోజుల క్రితం లావణ్య అదృశ్యమైనట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆర్‌సీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడు సునీల్ కుమార్ పోలీసులకు చిక్కాడు. లావణ్యను హత్య చేసి లగేజీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి సూరారం కాలనీలోని మురికికాలువలో పడేసినట్లు అనుమానంతో ఆర్‌సీపురం పోలీసులు, దుందిగల్ పోలీసుల సహాయంతో సూరారం కాలనీలోని మురికికాలువలో నిందితుడు పడేసిన లగేజీ బ్యాగ్‌ను చూపించాడు. బ్యాగ్‌ను తెరిచి మృతదేహాన్ని స్వాధీన పరుచుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.