క్రైమ్/లీగల్

వివాహితపై గ్యాంగ్ రేప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఏప్రిల్ 15: పార్టీ ఉందని ఇంటికి పిలిచారు. తాగిన మత్తులో ఎనిమిది మంది యువకులు వివాహితపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం నగరంలోని కొత్తపేట్ గ్రీన్‌హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న 32ఏళ్ల వివాహిత తన భర్తతో ఉన్న విభేదాల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది. ఈమేరకు మన్సూరాబాద్‌కు చెందిన సీసీ కెమెరాల వ్యాపారం చేసే మనోజ్ కుమార్ (30)తో పరిచయం కలిగింది. ఆ పరిచయం కాస్తా తర్వాత వారిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు సమాచారం. కాగా, మనోజ్ కుమార్ తన స్నేహితులు ఎనిమిది మంది కలిసి వనస్థలిపురం పరిధిలోని సాహేబ్‌నగర్ పరిసర పరిధిలోని ఓ ఇంట్లో పార్టీ ఉందని చెప్పి శనివారం రాత్రి వివాహితను ఆహ్వానించారు. అక్కడికి వెళ్లిన వివాహితతో మనోజ్ కుమార్ అతని స్నేహితులు కలిసి బలవంతంగా మద్యం తాగించారు. తాగిన మత్తులో ఉన్న ఎనిమిది మంది ఆమెపై సామూహికంగా అత్యాచారం జరిపారు. కాగా, సోమవారం సాయంత్రం బాధితురాలు తనకు న్యాయం చేయాలని వనస్థలిపురం పోలీసులను అశ్రయించింది. తగిన న్యాయం చేయాలని పోలీసులను కోరింది. హత్యచారానికి పాల్పడిన వారు 20 నుంచి 30 సంవత్సరాల లోపు యువకులని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో నిందితులను పట్టుకుని బాధితురాలుకి తగిన న్యాయం చేస్తానన్నారు.