క్రైమ్/లీగల్

ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఏప్రిల్ 15: తాండూరు డివిజన్ యాలాల మండలం దౌలాపూర్ గ్రామ సమీపంలో అంతరాష్ట్ర రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. తాండూరు డీఎస్పీ ఎం.రామచంద్రుడు, రూరల్ సర్కిల్ సీఐ జే.ఉపేందర్, యాలాల ఎస్సై విఠల్ రెడ్డి సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాలాల మండలం జుంటుపల్లి నుంచి తాండూరుకు వస్తున్న ఆటోను మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో సుమారు వంద మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. దుర్ఘటనలో తాండూరు పట్టణం బండప్పబాయి ఇందిరానగర్ కాలనీకి చెందిన తల్లీకూతుళ్లు పుట్నాల కుర్వ భారతమ్మ(62), ఆమె కూతురు పుట్నాల కుర్వతుల్జమ్మ (36), ఆటోలో ప్రయాణిస్తున్న యాలాల మండలం జుంటుపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు (హెచ్‌ఎం) అనంతయ్య, అతని భార్య లక్ష్మీ మృత్యువాతపడ్డారు. శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకోని జుంటుపల్లి జాతర వేడుకల్లో పుట్నాలు, తీపి పదార్థాలను భారతమ్మ, తుల్జమ్మ అమ్ముకొని ఇంటికి వస్తుండగా, సాయిపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు అనంతయ్య, అతని భార్య లక్ష్మీ వస్తుండగా ప్రమాదం జరిగింది. యాలల ఎస్సై విఠల్ రెడ్డి, సీఐ ఉపేందర్, డీఎస్పీ రామచంద్రుడు చేరుకొని క్షతగాత్రులైన ఆటోడ్రైవర్ అక్కంపల్లి ఆశప్ప అలియాస్ అశోక్‌ను, పనె్నండేళ్ల చిన్నారి శివకళను తాండూరు ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాజం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు.