క్రైమ్/లీగల్
వృద్ధుడి దారుణ హత్య!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కంఠేశ్వర్, ఏప్రిల్ 15: ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు వృద్ధుడి తలపై బండరాయితో మోది హత్య చేశారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరంలోని ముదిరాజ్వీధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని ముదిరాజ్ వీధిలో బొడ్డు మల్లయ్య(90), భార్య రాజవ్వ, కుమారుడు బొడ్డు సాయిలు ఇంటి ఆవరణలో ఆదివారం నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు బొడ్డు మల్లయ్య తలపై బండరాయితో మోదడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులకు రక్తపు మడుగులో శవమై పడి ఉన్న బొడ్డు మల్లయ్య కనిపించడంతో చుట్టు పక్కల వారి సహాయంతో 1వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ భువనేశ్వర్, టౌన్ సీఐ నరేష్, రూరల్ సీఐ రఘులు ఏసీపీ శ్రీనివాస్కు సమాచారం అందించారు. ఏసీపీ శ్రీనివాస్, సీపీ కార్తికేయకు సమాచారం అందించగా, డాగ్ స్క్వాడ్ను రప్పించి దుండగుల కోసం వెతికించినా ఫలితం లేకుండాపోయింది. కుమారుడు బొడ్డు సాయిలు మాట్లాడుతూ, తన తండ్రి మృతికి కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య రాజవ్వ, కుమారుడు బొడ్డు సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చిత్రం...ఘటనా స్థలిలో వృద్ధుడి మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఏసీపీ శ్రీనివాస్కుమార్