క్రైమ్/లీగల్

యాళ్లూరులో వ్యక్తి దారుణహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల రూరల్, మార్చి 26: గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మేజర్ పంచాయతీ యాళ్లూరు గ్రామంలో వడ్డె సంజీవకరుణ(56)ను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐ చిట్టిబాటు, ఎస్‌ఐ నరేష్‌లు తెలిపిన వివరాల మేరకు యాళ్లూరుకు చెందిన సంజీవకరుణ ఆదావారం అర్ధరాత్రి తప్పతాగి అసభ్యకరంగా మాట్లాడుతుండడంతో అదే గ్రామానికి చెందిన ఆయన ఇంటిపక్కన ఉన్న వడ్డె కులస్థులు అతనిపై దాడిచేసి రాళ్ళతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు అన్న సంజీవరాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. నాగేశ్వరీ, దొరబాబు, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు. మృతదేహాన్ని సోమవారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.