క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, ఏప్రిల్ 22: అప్పుల బాధలు భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలోని గొల్పర్తిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. గొల్పర్తికి చెందిన సాదుల నర్సింలు (35) తనకు ఉన్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం కోసం చేసిన అప్పులు అధికం కావడంతో మనస్తాపానికి గురై పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ మహేందర్ తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు నర్సింలు (ఫైల్‌ఫోటో)