క్రైమ్/లీగల్

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఏప్రిల్ 22: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరు మృతి చెందిన సంఘటన రాంపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్వాల్‌లోని సూర్య నగర్‌కు చెందిన గుడిమెట్ల అభిషేక్ (18), ఆర్‌ఎల్ నగర్‌కు చెందిన వేల్పుల పరిశుద్ధ (25) ద్విచక్ర వాహనంపై నాగారం నుండి ఘట్‌కేసర్ వైపువెళుతున్నారు. రాంపల్లి గ్రామ పరిధిలోని రీక్వెల్ ఫోర్డ్ స్కూల్ సమీపానికి రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారును ఢీకొట్టింది. అభిషేక్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన పరిశుద్ధను మెరుగైన వైద్యం అందించేందుకు నగరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుజరుపుతున్నారు.