క్రైమ్/లీగల్

రెండు స్కూటర్లు ఢీ.. ఒకని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌతాళం, మార్చి 26: మండల పరిధిలోని కుంటనహాల్ గ్రామ సమీపంలో ఎదురు ఎదురుగా వస్తున్న రెండు స్కూటర్లు ఢీకొని 10వ తరగతి విద్యార్థి సునిల్‌కుమార్(16) మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైనాయి. వివరాలిలా ఉన్నాయి. ఎరిగేరి గ్రామానికి చెందిన రాజు, అనంతమ్మ కుమారులు అన్న సునీల్‌కుమార్, తమ్ముడు ప్రసాద్ ఇద్దరు ఎరిగేరి జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. ఆదివారం పరీక్ష లేకపోవడంతో కర్నాటక రాష్ట్రంలోని శిరుగుప్ప తాలూకా నాగరహాల్ గ్రామానికి బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో వస్తుండగా కుంటనహాల్ గ్రామ సమీపంలో కుంటనహాల్ గ్రామానికి చెందిన రఫి మోటారు సైకిల్‌పై వస్తుండగా ఎదరు ఎదురుగా రెండు స్కూటర్లు ఢీకున్నాయి. దీంతో ముగ్గురు గాయపడ్డారు. అందులో సునీల్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కౌతాళం ఎస్‌ఐ తిమ్మయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అన్న మృతి చెందిన దుఃఖంతోనే పరీక్షకు హాజరు...
కుంటనహాల్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో అన్న సునీల్‌కుమార్ మృతి చెందగా ప్రసాద్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. అయితే అన్న మృతి చెందినా దుఃఖంతోనే 10వ తరగతి పరీక్షకు ప్రసాద్ హాజరయ్యాడు. అనంతరం అన్న అంత్యక్రియలకు హాజరయ్యాడు.