క్రైమ్/లీగల్

ముగ్గురు దళ సభ్యుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఏప్రిల్ 24: జనశక్తి చండ్ర పుల్లారెడ్డి బాట పార్టీకి చెందిన రాష్ట్ర కార్యదర్శి మోకాళ్ల సమ్మయ్య, ముగ్గురు దళ సభ్యులను అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సునీల్‌దత్ తెలిపారు. జనశకి సీపీబాట దళాలు గుండాల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అందిన కచ్చితమైన సమాచారం మేరకు ప్రత్యేక పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసి సమావేశంలో ఆయన తెలిపారు. గుండాల మండలం సమీపంలోని మల్లన్నవాగు బ్రిడ్జి వద్ద అనుమానాస్పందంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించామని, సీపీబాట దళ సభ్యులుగా గుర్తించామని తెలిపారు. సీపీబాట రాష్ట్ర కార్యదర్శి మోకాళ్ల సమ్మయ్య అలియాస్ కుమార్, దళ సభ్యులు అశ్వాపురం మండలం మావిళ్లవాయికి చెందిన పొడియం ఐతయ్య అలియాస్ దేవయ్య, అశ్వాపురం మండలం గుట్టబోరు గ్రామానికి చెందిన మడిమి దేవయ్య అలియాస్ దేవా, గుండాల మండలం పొడవటంచ గ్రామానికి చెందిన మోకాళ్ల రాంబాయిలను అరెస్టు చేసినట్లు తెలిపారు.
వీరి నుంచి నాలుగు తుపాకులు, 50 రౌండ్ల తూటాలు, 80 ఎంఎం తుపాకి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
సమ్మయ్యపై ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన జంట హత్య కేసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, కొమరారం, అశ్వాపురం మండలం మంగపేట ప్రాంతాల్లో తుపాకులు చూపించి కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. నక్సలైట్లు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వపరంగా పునరావాసం కల్పిస్తామని ఎస్పీ సునీల్‌దత్ వివరించారు. అదనపు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇల్లందు డిఎస్పీ ప్రకాష్‌రావు, గుండాల సీఐ చెన్నూరు శ్రీనివాస్, ఎస్సై బొల్లం రమేష్ పాల్గొన్నారు.
చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ సునీల్‌దత్