క్రైమ్/లీగల్
ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జీడిమెట్ల, ఏప్రిల్ 25: ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన దుందిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. దొమ్మరపోచంపల్లి గ్రామం, చంద్రశేఖర్ నగర్ కాలనీలో నివాసముండే మహ్మద్ ఫసియుద్దీన్ (35) ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. షాపూర్నగర్లో డ్యూటీ ముగించుకున్న ఫసీయుద్దీన్ తిరిగి ఇంటికి ఆర్టీసీ బస్సులో వస్తున్నాడు. గండిమైసమ్మ చౌరస్తాలో ముందు ఫుట్ బోర్డుపై నిలబడిన ఫసీయుద్దీన్ ఒక్కసారిగా బస్సు ముందుకి కదలడంతో కిందపడిపోయాడు. బస్సు ముందు చక్రాల కింద పడిన ఫసీయుద్దీన్కు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.