క్రైమ్/లీగల్

కొండాకు నాంపల్లి కోర్టులో చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: కాంగ్రెస్ సీనియర్ నేత కొండా విశే్వశ్వరరెడ్డికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు విశే్వశ్వరరెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించింది. ఎస్సై , హెడ్ కానిస్టేబుల్‌ను నిర్బంధించిన సంఘటనలో కొండా ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు విశే్వశ్వరరెడ్డికి ముందస్తు బెయిల్ పిటీషన్‌ను గురువారం నాడు కొట్టివేసింది. అయితే అజ్ఞాతంలో ఉన్న కొండా విశే్వశ్వరరెడ్డి కోసం గత వారం రోజులుగా బంజారాహిల్స్ పోలీసులు వెతుకుతున్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశే్వశ్వరరెడ్డి సన్నిహితుడు సందీప్ రెడ్డి వద్ద పది లక్షల రూపాయిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా బంజారాహిల్స్‌లోని విశే్వశ్వరరెడ్డి నివాసానికి పోలీసులు వెళ్లారు. ఈ నేపథ్యంలో కొండా అనుచరులు ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌ను నిర్బంధించారు. దీంతో వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అప్పటినుండి కొండా విశే్వశ్వరరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. రెండు రోజుల క్రితమే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.