క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు ఢీకొని భార్యాభర్తల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్చారం, ఏప్రిల్ 29: అతి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు.. బైక్‌ను ఢీకొట్టిన సంఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామశివారులో రంజ్య తండాకు చెందిన మాలోవత్ రమేశ్ (38), జ్యోతి (32)లు మెదక్ మండలం బూర్గుపల్లి గ్రామానికి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు. అయతే, పోతంశెట్టిపల్లి సమీపంలో ఏడుపాయలకు వెళ్ళే రోడ్డు వద్దకు రాగానే సికింద్రాబాద్ నుండి మెదక్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న వీరిని ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బైక్‌పై ఉన్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, మృతులకు ముగ్గురు పిల్లలు ఉండగా పెద్ద కుమారుడు రోహిత్ వేరే బైక్‌పై ఉన్నాడు. వైష్ణవి, రాహుల్ సంతానం ఉన్నట్లు తెలిసింది. ఆ వెంటనే పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.