క్రైమ్/లీగల్

ప.గో జిల్లాలో యువతి కిడ్నాప్ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 30: తల్లితో కలిసి నడిచివెళుతున్న ఒక యువతిని ఒక యువకుడు కారులో కిడ్నాప్ చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం కలకలం సృష్టించింది. యువతిని తీసుకెళుతున్న కారు అతివేగంగా వెళుతూ ప్రమాదానికి గురికావడం, అందులోని యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేయడం, తదనంతరం ఇదంతా ప్రేమ వ్యవహారమని తేలింది. కిడ్నాప్ సమయంలో జరిగిన పెనుగులాటలో యువతి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. చివరకు యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలావున్నాయి... తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని గొల్లగరువు ప్రాంతానికి చెందిన నాగళ్ళ అరుణకుమారి కుటుంబం గత నాలుగేళ్లుగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ మండలం పూలపల్లిలో నివసిస్తోంది. అరుణకుమారి కుమార్తె నాగళ్ళ అనూష (23) అదే ప్రాంతానికి చెందిన షేక్‌నయంతుల్లా (23) ప్రేమించుకున్నారు. ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు 28 రోజుల క్రితం పాలకొల్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే నయంతుల్లాకు ఉద్యోగం వచ్చాక చేసుకోవాలని పోలీసులు వారికి సూచించారు. ఈ విషయం తెలుసుకున్న అనూష కుటుంబం కొద్ది రోజుల క్రితం పాలకోడేరు మండలంలోని విస్సాకోడేరు గ్రామానికి వచ్చేసింది. కాగా మంగళవారం ఉదయం 12 గంటల సమయంలో స్ట్ఫా సెలక్షన్ కమిషన్ ఉద్యోగ నియకాలకు దరఖాస్తు చేసుకోవాలని అనూష చెప్పడంతో తల్లి వెంటపెట్టుకుని బయటకు తీసుకువచ్చింది. అదే సమయంలో నయంతుల్లా కారులో అక్కడకు వచ్చి అనూషను ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు. ఆ సమయంలో తల్లి అరుణకుమారి ప్రతిఘటించడంతో ఆమెను తోసేసి అనూషను తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటనలో అరుణకుమారి తీవ్రంగా గాయపడింది. అనంతరం అత్యంత వేగంగా భీమవరం నుండి తాడరువైపు వెళ్లిన ఆ కారు ముందుచక్రం పంక్చరై ఊడిపోయింది. దీనితో కారు అదుపుతప్పి, తాడేరు గ్రామంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఇది గమనించిన స్ధానికులు కారులోని నయంతుల్లాను పట్టుకున్నారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న తల్లి అరుణకుమారి తన కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతున్నాడని చెప్పడంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తల్లి అరుణకుమారి ఫిర్యాదు మేరకు పాలకోడేరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

చిత్రం... నయంతుల్లాకు దేహశుద్ధి చేస్తున్న స్థానికులు