క్రైమ్/లీగల్

ఆస్తి కోసం దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, ఏప్రిల్ 30: ఆస్తి వివాదంతో సవతి తల్లిపై పగను పెంచుకున్న కానిస్టేబుల్ ఆమె కళ్లలో కారం చల్లి కొడవలితో నరికి చంపాడు. మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మాదన్నపేట బోయబస్తీకి చెందిన కొలన్ యాదయ్య అక్కా చెళ్లెల్లను పెళ్లి చేసుకున్నాడు. యాదయ్య పదవీ విరమణ అనంతరం బీహెచ్‌ఈఎల్‌లోని ఇళ్లు, మాదన్నపేటలోని ఒక ఇళ్లు పెద్ద భార్య కుమారుడు శ్రీకాంత్‌కు, మాదన్నపేటలోని మరో ఇళ్లును చిన్న భార్య సుకన్యకు పంచాడు. శ్రీకాంత్(40) ఏఆర్ కానిస్టేబుల్‌గా సీటీ బాంబ్‌స్వ్కాడ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.
సుకన్య కూతురు, కొడుకుతో మాదన్నపేటలోని ఇంటిలో నివసిస్తుంది. సవతి తల్లికి ఇచ్చిన ఇంటిని కూడా తన పేర రాయల్సిందిగా శ్రీకాంత్ తరుచూ గొడవపడేవాడు. నాలుగు నెలల క్రితం యాదయ్య అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి శ్రీకాంత్ ఆస్తి విషయమై తరుచూ సుకన్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ మంగళవారం మాదన్నపేటలోని ఇంటిలోకి చొరబడి సుకన్య తప్పించుకోకుండా మొదట కళ్లలో కారం చల్లి తనతో తెచ్చుకున్న కొడవలితో విచక్షణ రహితంగా నరికి పారిపోయాడు. సోదరుడు శ్రీకాంత్‌తో ప్రాణభయం ఉందని మృత్యురాలు సుకన్య కొడుకు, కూతురు వాపోయారు. మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్‌ను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.