క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో తండ్రి, కొడుకుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణపురం, ఏప్రిల్ 30: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులిద్దరూ విద్యుత్ షాక్‌తో మంగళవారం మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయ. చెల్పూరు గ్రామానికి చెందిన నడిగొట్టు రాజయ్య (55), నడిగొట్టు రాజు (25) తండ్రీ కొడుకులు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం కేటీపీపీ సమీపంలో ఉన్న బొందిలోల్ల మోరి సమీపంలో ఉన్న విద్యుత్ మోటార్ వద్దకు వెళ్లారు. సమీపంలోనే రాజయ్య ఎకరం వరిపంట వేశాడు. పంటకు సరిగా నీరందక పోవడంతో నీరు పారించేందుకు మోటార్ వద్దకు వెళ్లగా మోటార్ మొరాయించింది. నీరు తక్కువగా ఉండడంతో ఫుట్‌వాల్వ్‌లో చెత్తాచెదారం చేరి ఉంటుందనే ఉద్దేశంతో రాజయ్య కుమారుడు రాజు నీటిలోకి దిగి చెత్త తొలగిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. కొడుకును రక్షించేందుకు ప్రయత్నించిన రాజయ్య కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. రైతు రాజయ్యకు కూతురు, కుమారుడు ఉండగా ఒక్కగానొక్క కుమారుడు రాజు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. రైతు రాజయ్యకు భార్య అనసూయ, రాజయ్య కుమారుడు రాజుకు భార్య గీత, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంఘటనపై స్థానిక ఎస్సై వడిచర్ల గోవర్ధన్ వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రం... మృతుల వద్ద రోదిస్తున్న కుటుంబీకులు