క్రైమ్/లీగల్

బైక్‌లను ఢీకొన్న ఎస్‌యూవీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణె, మే 1: మహారాష్ట్రంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛకాన్ జిల్లాలోని ఖాలుబ్రేలో మూడు మోటర్ సైకిళ్లపై ఎస్‌యూవీ దూసుకుపోవడంతో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం ఫేబ్రికేషన్ యూనిట్‌లో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులు మూడు మోటర్ బైక్‌లపై ఇళ్లకు వస్తున్నారు. రోడ్డుకు అవతల పక్కన వెళ్తున్న ఎస్‌యూవీ డివైడర్‌ను ఢీకొని ఇవతల వైపుఉన్న బైక్‌లపై దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురూ అక్కడికక్కడే మరణించారు. ఎస్‌యూవీ డ్రైవర్ గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.