క్రైమ్/లీగల్

ఈతకు వెళ్లి.. బాలుడి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మే 1: సరదాగా ఈతకు వెళ్లిన ఓ బాలుడు క్వారీ కుంటలో మునిగి గల్లంతైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గాజులరామారం డివిజన్ కైసర్ నగర్, రాజన్నబస్తీలో నివాసముండే అబ్దుల్ సలీమ్ డ్రై క్లీనింగ్ దుకాణం నడుపుతుంటాడు. అతని కుమారుడు ఇబ్రాన్(15) ప్రైవేట్ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. మంగళవారం రాజన్నబస్తీలో నివాసముండే మరో ముగ్గురు పిల్లలతో కలిసి కైసర్‌నగర్‌లోని క్వారీ కుంటలో ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో ఇబ్రాన్ కుంటలోనే మునిగిపోయాడు. బయపడిన ముగ్గురు పిల్లలు ఎవరికీ చెప్పలేదు. బుధవారం ఇబ్రాన్ తండ్రి సలీమ్ కుమారుని కొరకు వెతుకుతుండగా పిల్లలు జరిగిన విషయాన్ని తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రమైనా మృతదేహం లభించకపోవడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు గురువారం మళ్లీ గాలిస్తామని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.