క్రైమ్/లీగల్

ప.గో.లో ఆటోను ఢీకొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, మార్చి 28: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం వద్ద బుధవారం ఉదయం ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్టేరు నుండి పాలకొల్లు వెళుతున్న ఆటోను జగన్నాథపురం వద్ద పాలకొల్లు వైపు నుండి వస్తున్న గుర్తు తెలియని లారీ ఎదురుగా ఢీకొంది. దీనితో ఆటో రోడ్డు పక్కనే ఉన్న పంట కాలువలోకి బోల్తాపడింది. ఈప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మోతుకూరి మల్లికార్జునరావు(63), కృష్ణాజిల్లా కలిదిండి మండలం మూల్లంకకు చెందిన ఈతకోట నాగరాజు (36), పోడూరు మండలం పండితవిల్లూరుకు చెందిన ఆటో డ్రైవరు దొంగ వెంకటేశ్వరరావు (40) అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మోతుకూరి నాంచారయ్య, నాటిన భాగ్యలక్ష్మి, ఆమె భర్త శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం గోగులమఠం గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన నాంచారయ్య మృతుల్లో ఒకరైన మల్లికార్జునరావు కుమారుడు. మార్టేరులో ఏటా జరిగే వెంకటేశ్వరస్వామి ఉత్సవాల్లో తెనాలికి చెందిన మల్లికార్జునరావు ప్లాస్టిక్ బొమ్మలను విక్రయించడానికి వస్తాడు. వృద్ధాప్యం కారణంగా ఈసారి కొడుకు నాంచారయ్యను తోడుగా తెచ్చుకున్నాడు. ఉత్సవాలు ముగియడంతో తెనాలి తిరిగి వెళ్లడానికి పాలకొల్లు రైల్వే స్టేషన్‌కు వెళ్లడానికి ఆటో ఎక్కి ప్రమాదానికి గురయ్యారు. అలాగే కృష్ణా జిల్లా మూలలంకకు చెందిన ఈతకోట నాగరాజు ఉత్సవాలను తిలకించడానికి వచ్చి, ఆటో ఎక్కి ప్రమాదానికి గురయ్యాడు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పాలకొల్లు తరలించారు. పాలకొల్లు సీఐ రజనీకుమార్ ఆధ్వర్యంలో పోడూరు ఎస్సై రామకృష్ణ కేసు దర్యాప్తుచేస్తున్నారు.