క్రైమ్/లీగల్

బాహుదాలో మునిగి నలుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం(రూరల్), మే 13: ఎండలు మండిపోతుండడంతో వేసవితాపానికి ఉపశమనం కోసం తమ ఇంటి సమీపంలో వున్న బాహుదా నదిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం మండలం, బిర్లంగి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తల్లులు, వారి పిల్లలు సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు బాహుదానదిలో జారి పడి మృతి చెందారు. సోమవారం సాయంత్రం ఎన్.్ఢల్లీమ్మ(33), ఆమె కుమార్తె గీతాంజలి(13), ఎన్.కమలమ్మ(33) ఆమె కుమార్తె గాయత్రి(10) స్నానానికి నదిలో దిగి స్నానం చేస్తుండగా ఓ బాలిక నీటిలో మునిగిపోగా, కాపాడేందుకు ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ నలుగురూ మృతి చెందారని స్థానికులు తెలిపారు. సమీపంలో వున్న వారు ఈ సంఘటన తెలుసుకొని గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారంతా వచ్చి నదిలో గాలింపు చర్యలు చేపట్టి మునిగిపోయిన వారిని ఒడ్డుకు చేర్చారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ సింహాచలం తెలిపారు.