క్రైమ్/లీగల్

మామ చేతిలో అల్లుడు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మే 16: వ్యాపారానికి అడ్డువస్తున్నాడనే కక్ష్య అల్లుడిని రాడ్‌తో దాడి చేసి మామ హత్య చేసిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాచుపల్లి గ్రామం శ్రీవాణి నగర్ జ్యోతి ప్లాంట్‌లో నివాసముండే ఎండీ జాకీర్ హుస్సేన్ (48) బాచుపల్లి నుంచి మియాపూర్ వెల్లే దారిలో సింఘిల్ టయర్స్ అండ్ మార్బుల్స్ ప్రక్కన పంచర్ దుకాణం నడుపుతుంటాడు. సెకండ్ హాండ్ టయర్స్‌ను కొనుగోలు చేస్తుంటాడు. జాకీర్ హుస్సేన్ మేనమామ ఎండీ సుభాని కూడా సెకండ్ హాండ్ టయర్స్ కొనుగోలు చేస్తాడు. కొంతకాలంగా వీరి ఇద్దరి మధ్య పాత టయర్స్ కొనుగోలు విషయంలో పరస్పరం గొడవలు జరుగుతున్నాయి. ఎండీ సుభానీ తన వ్యాపారానికి అడ్డు వస్తున్నాడనే కక్ష్యను పెంచుకున్నాడు. షాపులో ఉన్న జాకీర్ హుస్సేన్‌పై సుభాని దాడికి పాల్పడ్డాడు. ఇనుప రాడ్‌తో వచ్చిన సుభాని.. జాకీర్‌పై దాడి చేశాడు. దాడిలో తలకు, వీపుకు గాయాలైన జాకీర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.