క్రైమ్/లీగల్

ప్రేమజంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వల్లూరు, మే 21: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. అయితే ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో కలిసి ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కడప జిల్లా వల్లూరు మండలం గంగాయపల్లె రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. మంగళవారం ఉదయం పట్టాలపై మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వాస్తవం వెలుగుచూసింది. మృతులను అనంతపురం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ రమేష్, సబితగా గుర్తించారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం నగరంలోని 1వ పట్టణ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేష్‌బాబు, పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామానికి చెందిన సబిత ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో వారు ప్రేమ పెళ్లికి నిరాకరించారు. రమేష్‌కు అతని తల్లిదండ్రులు మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. వచ్చేనెల పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెద్దలు ప్రేమ వివాహానికి ఒప్పుకోకపోవడంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని రమేష్, సబిత నిర్ణయించుకున్నారు. సోమవారం రాత్రి కడప జిల్లా వల్లూరు మండలం గంగాయపల్లె రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం రైల్వేపోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం కడపకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.