క్రైమ్/లీగల్

కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్ధన్నపేట, మే 24: కట్టుకున్న భర్త కాలయముడై తన భార్యను పదునైన వస్తువుతో అతి కిరాతకంగా గొంతుకోసి చంపిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. వర్ధన్నపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామంలో చెవ్వల యాదగిరి అనే వ్యక్తి 25 సంవత్సరాల క్రితం రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మల్లికాంబతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తలకు మధ్య తరచూ కుటుంబ కలహాలు, గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో వీరి గొడవలను సద్దుమణిగించేందుకు పలుమార్లు పెద్ద మనుషులు ప్రయత్నం చేసినప్పటికీ కుటుంబ కలహాలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో విసుగు చెందిన మల్లికాంబ ఎనిమిది సంవత్సరాల క్రితం భర్తను, పిల్లలను వదలిపెట్టి తన తల్లిగారి ఊరు కొత్తూరు గ్రామానికి వెళ్లింది. యాదగిరి తన కుమారులతో కలిసి వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 16న ఇరుగ్రామాలకు చెందిన పెద్ద మనుషులు వారి మధ్య మళ్లీ రాజీ చేశారు.
దీంతో ఈనెల 16నుండి మల్లికాంబ తన భర్తతో కట్రియాల గ్రామంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. భార్య నిద్రిస్తున్న సమయంలో యాదగిరి శుక్రవారం తెల్లవారుజామున పదునైన అయుధంతో భార్య గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వర్ధన్నపేట పోలీస్ క్లూస్ టీం సభ్యులు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్ధానిక ఎస్సై మస్క శ్రీనివాస్ తెలిపారు.