క్రైమ్/లీగల్
తనయుడి కళ్లముందే తల్లి దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 12 June 2019
మేడ్చల్, జూన్ 11: రోడ్డు ప్రమాదంలో తనయుడి కళ్ల ముందే తల్లి దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మెదక్ తుప్రాన్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ(55) కుమారుడు పవన్ గౌడ్(27)తో కలిసి ద్విచక్ర వాహనంపై మంగళవారం వెళుతుండగా మేడ్చల్ 44వ జాతీయ రహదారి చెక్పోస్టు వద్ద కంటైనర్ లారీ ఢీకొట్టింది. లక్ష్మీ తల భాగం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కుమారుడు పవన్ గౌడ్కు స్వల్ప గాయాలయ్యాయి. కళ్ల ముందే కన్నతల్లి ప్రమాదంలో దుర్మరణం చెందడంతో పవన్ తల్లడిల్లిపోయి కన్నీటి పర్యంతమయ్యాడు.