క్రైమ్/లీగల్

ఇద్దరికి జైలు, జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 13: వీటీపీఎస్‌లో ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన ఇద్దరికి ఏడాది పాటు జైలుశిక్ష, రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఇబ్రహీంపట్నం కొండపల్లికి చెందిన కత్తురాజు రామకృష్ణ అనే వ్యక్తి బంగారం పని చేస్తుంటాడు. కాగా కొండపల్లికి చెందిన వేమినీడి సూర్యనారాయణ అలియాస్ సూరిబాబు (40), హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన దాకి సూర్యప్రకాశరావు (67)లు పరిచయమై ఇబ్రహీపట్నం వీటీపీఎస్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. ఇందుకుగాను అతని వద్ద నుంచి రూ.2లక్షలు దండుకుని మోసానికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు సూరిబాబు ఫిర్యాదు మేరకు 2011లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరుఫున పోలీసులు ప్రవేశపెట్టిన నలుగురు సాక్షులను విచారించిన మీదట నిందితులపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.