క్రైమ్/లీగల్

నంద్యాలలో రూ.2.14 కోట్ల విత్తనాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల రూరల్, జూన్ 15: కర్నూలు జిల్లా నంద్యాలలో రూ.2.14 కోట్ల విలువ చేసే విత్తనాలను విజిలెన్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. విత్తన శుద్ధి, విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లపై అధికారులు దాడులు చేసి ఎలాంటి రికార్డులు, రసీదులు లేని రూ.2.14 కోట్ల విలువచేసే 13,161 విత్తనాల సంచులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సీడ్స్, శ్రీ జగదీశ్వర సీడ్స్, శ్రీ మహాలక్ష్మి ఆగ్రోసీడ్స్, శ్రీ మహాలక్ష్మి సీడ్స్ ప్రాసెసింగ్ ప్లాంట్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇంత పెద్దమొత్తంలో విత్తనాలు స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. నకిలీ విత్తనాలతో మోసం చేస్తున్న ప్రాసెసింగ్ యూనిట్లపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.