క్రైమ్/లీగల్

నీటి తొట్టెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, జూన్ 16: అమ్మఒడిలో గోరుముద్దలు తింటూ.. ఆడుతూ.. పాడుతూ.. పరుగులు తీస్తూ ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలో ఉంచిన నీటి టబ్బులో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని కోలభీమునిపాడు ఎస్సీపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గిడుగు రంగయ్య అలియాస్ దానం కుమారుడు రాము (2) ఆదివారం మధ్యాహ్నం అమ్మఒడిలో కూర్చుని గోరుముద్దలు తింటూ అటుఇటు పరుగులు తీస్తున్నాడు. తల్లి అరుణ కొడుకు చేష్టలకు ఆనందం వ్యక్తం చేస్తూ అన్నం తినిపిస్తుండగా ఉన్నఫలంగా బయటకు పరిగెత్తిన కుమారుడు తిరిగి ఇంటిలోనికి రాకపోవడంతో బయటకువెళ్లింది. అప్పటికే చిన్నారి రాము ఇంటి ఆవరణలో టబ్బులో నింపిపెట్టిన నీటిలో పడి మునిగి ఊపిరి ఆడక నిర్జీవంగా పడి ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.