క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో భార్య,భర్త మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 18 June 2019
బాలాపూర్, జూన్ 17: ఫంక్షన్కు వచ్చి తిరుగు ప్రయాణంలో ఓ కారు డీ కొని భార్య భర్త ఇద్దరు మృతి చెందిన సంఘటన సోమవారం ఆర్థరాత్రి మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాత బస్తీ సుల్తాన్ సషికి చెందిన కే.గణేష్ కుమార్ (35) అతని భార్య జ్యోతి చంపాపేట్లోని లక్ష్మరెడ్డి గార్డెన్లో ఓ ఫంక్షన్కు హజరై.. కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ సమీపంలో యూ టర్న్ తీసుకుంటుండగా, ఏపీ 05ఈఎన్ 2255 నెంబర్ గల వేర్నా కారు అతివేగంగా డీకొట్టినది. కారు ఢీకొనడంతో జ్యోతి అక్కడికి మృతి చెందగా, భర్త అపోల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. తెల్లవారు ఝామున మృతి చెందినాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపటినట్లు తెలిపారు.