క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 21 June 2019
గచ్చిబౌలి, జూన్ 20: వేగంగా వచ్చిన కారు.. మోటార్ సైకిల్ని ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం ప్రాంతానికి చెందిన బోయిని ఆనంద్ కుమార్ (27) స్విగ్గీ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. మధ్యాహ్నం 1.30 సమయంలో జేఎన్టీయూ నుంచి గచ్చిబౌలి వైపు మోటార్ సైకిల్పై వస్తుండగా సైబర్ టవర్ ఫ్లైవర్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆనంద్ కుమార్ అక్కడిక్కడే మృతిచెందాడు.