క్రైమ్/లీగల్

బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, జూన్ 22: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఒక లాడ్జిలో 15 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేసిన యువకుడుతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిపై కూడా ఎస్సై అల్లు దుర్గారావు శనివారం అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా పలుకులూరు రోడ్డు, రాఘవేంద్ర కాలనీకి చెందిన నందిగం దుర్గాదేవి ఫిర్యాదు మేరకు నిందితుడు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కంపా మహేష్ (28), అతనికి సహకరించిన బాధితురాలి తండ్రి దేవర రోహిత్, వీరంకి మాధవ్, బాబిలపై 376 (2)(ఐ) మరియు (4) ఐపిసి 384, 342, 506 రెడ్‌విత్ 34 ఐపిసి, సెక్షన్ 6 ఆఫ్ పోక్సో 2012 యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన దేవర రోహిత్, గుంటూరు జిల్లాకు చెందిన నందిగం దుర్గాదేవి 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి 15 సంవత్సరాల కుమార్తె, 12 సంవత్సరాల కుమారుడు ఉన్నారని పోలీసులు తెలిపారు. 2013లో దుర్గాదేవికి, ఆమె భర్త దేవర రోహిత్‌కు మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటి నుండి ఇద్దరు పిల్లలు ఏప్రిల్ 2018 వరకు దుర్గాదేవి వద్దనే ఉన్నారు. 2018 ఏప్రిల్ నుండి ఇద్దరు పిల్లలు తండ్రి దేవర రోహిత్ వద్ద జంగారెడ్డిగూడెంలో ఉంటున్నారు. రోహిత్‌కు దగ్గరి బంధువు అయిన కంపా మహేష్ ఈ నెల 11వ తేదీ నుండి వరుసగా నాలుగు రోజులు బాలికను బలవంతంగా ఎస్‌విఎల్ లాడ్జిలో అనుభవించినట్టు దుర్గాదేవి ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. దుర్గాదేవి భర్త రోహిత్ సహకారంతోనే కంపా మహేష్ బాధిత బాలికపై నాలుగు రోజులు అత్యాచారం చేసినట్టు తెలిపారు. బాలిక తప్పించుకుని వెళ్ళిపోతుండగా కంపా మహేష్‌తో పాటు వీరంకి మాధవ్, బాబి అనే వ్యక్తులు భీమవరం రైల్వే స్టేషన్‌లో పట్టుకుని బాబి ఇంటిలో నిర్బంధించి, ఆమె వరుసకు సోదరుడైన శ్రీరామ్ వద్ద సెల్‌ఫోన్, మోటార్ సైకిల్ బలవంతంగా లాక్కుని, ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారని తెలిపారు. ఈమేరకు ఎస్సై అల్లు దుర్గారావు కేసు నమోదు చేయగా, డీఎస్పీ చిటికెన మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.