క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొంపిచర్ల, జూన్ 22: గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌కు చెందిన అన్నంగి చైతన్య భార్య పూజిత, తల్లిదండ్రులు విజయకుమార్, తిరుపతమ్మ, అత్తమామలు సిద్దంశెట్టి సుజాత, గోపీకృష్ణలతో కలిసి నెల్లూరు జిల్లా జొన్నవాడ కామాక్షీతాయి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకునేందుకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు రొంపిచర్ల మండలం సంతగుడిపాడు దగ్గరకు వచ్చే సరికి డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొని గాల్లోకి లేచి రోడ్డు రెండో వైపు పడి పల్లంలోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో సిద్దంశెట్టి సుజాత (52) అక్కడికక్కడే మృతి చెందింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా అన్నంగి విజయకుమార్ (62) మృతి చెందాడు. చికిత్స పొందుతూ సిద్దంశెట్టి గోపీకృష్ణ (54) మృతి చెందాడు. గోపీకృష్ణ సికింద్రాబాద్ ఎల్‌ఐసి డివిజన్ ఆఫీస్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కారు డ్రైవర్ వినీత్, అన్నంగి తిరుపతమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అన్నంగి చైతన్య తండ్రి విజయకుమార్, అత్తమామలు సుజాత, గోపికృష్ణ ఈ ప్రమాదంలో మృతి చెందారు. చైతన్య ఫిర్యాదు మేరకు రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రం...రోడ్డు పక్కకు పల్టీలు కొట్టిన కారు